చేజేతులారా జక్కన్న సినిమాలను వదులుకున్న బాలయ్య.. కారణం..?

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన సినిమాలలో కనిపించాడు అంటే చాలు ప్రేక్షకులలో ఎక్కడ లేని వూపు వచ్చేస్తూ ఉంటుంది. తన నటనతో.. మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించ గలిగే సత్తా బాలయ్య లో ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే దర్శకులు లేదా రచయితలు ఒకరిని దృష్టిలో పెట్టుకొని కథ అనుకుంటే మరొకరితో సినిమా తీయాల్సి వస్తుంది. ఇలా అగ్ర హీరోలు సైతం ఎన్నో సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో సినిమా రాకపోవడం తో అందరూ కూడా ఆ కాంబినేషన్ లో సినిమా రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఎస్.ఎస్.రాజమౌళి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక మూవీ కూడా రాలేదు . కానీ గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన రెండు సినిమాలు కూడా రాకపోవడానికి కారణం బాలయ్యే అని తెలుస్తోంది.అసలు విషయంలోకి వెళ్తే.. వీరిద్దరి కాంబినేషన్లో రావల్సిన రెండు సినిమా కథలను ముందుగా బాలయ్యకు జక్కన్న వినిపించినప్పటికీ.. వివిధ కారణాలవల్ల కుదరకపోవడంతో వేరే వాళ్ళతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు రాజమౌళి. అందులో ఒకటి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రి. ఈ కథను ముందుగా బాలయ్య బాబుకు వినిపిస్తే అప్పటికే బి.గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు మూవీ తీస్తున్న కారణంగా ఈ సినిమాను ఒప్పుకోలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఈ సినిమా తీసి రాజమౌళి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక మగధీర సినిమా కథను కూడా ముందుగా బాలయ్యకు వినిపించగా.. ఆయన ఎందుకో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇక రామ్ చరణ్ తో ఈ సినిమా తీసి ఇండస్ట్రీకి హిట్ ను సాధించాడు జక్కన్న. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version