Bigg boss 7: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. డబ్బు మొత్తం వారికే..!

-

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు రూ. 35 లక్షల ప్రైస్ మనీ దక్కింది. దానితోపాటు రూ. 15 లక్షల విలువ చేసే కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ప్రశాంత్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉండనుంది. ఓవరాల్ గా రూ. కోటి విలువైన సొత్తును ఆయన దక్కించుకున్నారు.

Bigg Boss winner Prashanth prize money to farmers

అయితే..బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ ప్రశాంత్…..తాను గెలిచిన రూ.35 లక్షలను రైతుల కోసమే వినియోగిస్తానని ప్రకటించారు. “నన్ను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. బిగ్ బాస్ లో ఆడాలని ఎన్నో రోజులుగా అనుకున్న. అన్నం తినని రోజులు కూడా ఉన్నాయి. రైతుల కోసమే వచ్చా. ఆడాను. గెలిచాను. నేను గెలిచిన కారు నాన్నకు. నెక్లెస్ అమ్మకు ఇస్తాను. జై జవాన్. జై కిసాన్” అని భావోద్వేగానికి గురయ్యారు ప్రశాంత్.

Read more RELATED
Recommended to you

Latest news