చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ దర్శకుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు  చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ శ్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ముంబైలోని కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గోవిందా స్టార్ హీరోగా మారడంలో ఇస్మాయిల్ కీలక పాత్ర పోషించగా, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, లవ్ 86, తోడ తుమ్ బద్ లో తోడ హామ్ సహా 20 సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. ఏపీలోని కర్నూలులో ఆయన జన్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version