టాలీవుడ్‌లో మ‌రో వార‌సుడు ఎంట్రీ

-

టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా వ‌ర‌సుల రాజ్యం న‌డుస్తోంది. ఇప్పుడున్న టాప్ హీరోలు అంద‌రూ త‌మ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను యూజ్ చేసుకుని వార‌సులుగా హీరోలయ్యారు. ఈ వారసుల ప‌రంప‌ర కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌రో వార‌సుడు ఇప్పుడు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు.
ప్రముఖ నటుడు బ్రహ్మజీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాధించుకున్నాడు. బ్రహ్మజీ దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు. అయితే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా న‌టించాడు.


ప్ర‌స్తుతం బ్రహ్మజీ కుమారుడు సంజయ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌డం కాబోయే సంజ‌య్ ఇంత‌కు ముందు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ గా ప‌ని చేశారు. అయితే సంజయ్ తొలి చిత్రం రెగ్యులర్ షూట్ ఇప్పటికే ప్రారంభమైంది. సినిమా విష‌యాలు కానీ, షూటింగ్ విష‌యాలు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ‘నేనే తోపు రా` లో నటించిన నిత్య శెట్టి సంజ‌య్‌కు జోడీగా న‌టిస్తుంది. మ‌రియు బ్రహ్మాజీ కూడా కొడుకు తొలి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే హైదరాబాద్‌లో షూట్ ముగించిన తరువాత, ఫిల్మ్ యూనిట్ ఒక ప్రధాన షెడ్యూల్ కోసం అమలాపురానికి వెళ్తుంది. ఈ షూటింగ్ పార్ట్ త‌ర్వాత చిత్ర యూనిట్ స‌భ్య‌లు సినిమా విష‌యాల గురించి వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

ప‌లు హిట్ చిత్రాల‌ను అందించిన‌ ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ తన భవ్య క్రియేషన్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొద్దు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కాబోతున్నాడు. ఇక బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ తొలి చిత్రంలో ఎలా స‌త్తా చాటతాడో చూడాలి. అలాగే ఇటు బ్ర‌హ్మాజీ కుమారుడు ఈ చిత్రంతో పాటు  సై రా నరసింహ రెడ్డి మరియు వాల్మీకిలలో కూడా న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news