బ్రో: రాబోయే రోజుల్లో మూవీతో అరుదైన రికార్డు సృష్టించిన పవన్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరంతేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల పరంగా భారీగా దూసుకుపోతోంది. ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకొని విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్ పొందుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓవర్సీస్ లో ఈ చిత్రం రికార్డు సాధించిందని చెప్పవచ్చు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించగా.. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. రూ .100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రూ.50 కోట్ల పారితోషకం తీసుకున్న విషయం తెలిసిందే.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో సహా చాలా ప్రాంతాలలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి థియేటర్లన్ని ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. అంతేకాదు యూఎస్, ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్న దేశాలలో కూడా ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా యూఎస్ , కెనడాలో 238 లోకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించగా ఈ సినిమాకి ప్రీమియర్స్ ద్వారానే సుమారుగా 647 K డాలర్స్ గ్రాస్ లభించింది. అలాగే ఫస్ట్ డే 216 K డాలర్లు వచ్చినట్లు సమాచారం. ఇలా మొదటి రోజే ప్రీమియర్స్ ద్వారా ఏకంగా 863 K డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

మరొకవైపు రెండవ రోజు కొంచెం తక్కువగానే స్పందన లభించిందని చెప్పాలి . శనివారం రోజు ఈ చిత్రానికి విదేశాలలో 185 కే డాలర్లు మాత్రమే లభించాయి. ఇక మొదటి రెండు రోజుల్లోనే 1.04 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా ఘనత సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news