టాలీవుడ్ స్టార్ కమెడీయన్ ఇంట తీవ్ర విషాదం

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా ప్రముఖ హాస్యనటుడు రఘు ఇంట విషాదం చోటు చేసుకుంది.

కారుమంచి రఘు తండ్రి వెంకట్‌ రావు మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్లు. వెంకట్‌ రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలతోనే గురువారం ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలందించిన వెంకట్‌ రావు.. పదవీ విరమణ పొందిన తర్వాత ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇక ఆయన మృతి పట్ల పలుగురు స్టార్లు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news