బాలీవుడ్‌లో దీపిక హాలోవీన్  డ్ర‌గ్స్ పార్టీ క‌ల‌క‌లం!

-

సుశాంత్ మృతి కేసులో డ్ర‌గ్స్ కీల‌క పాత్ర పోషించింద‌ని అనుమానించిన ఎన్సీబీ అధికారులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తుని ముమ్మ‌రం చేయ‌డం, రియాని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తుండ‌టంతో సుశాంత్ కేసు కీల‌క మ‌లుపులు తిరుగుతూ స‌రికొత్త సంచ‌నాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ కేసుతో డ్ర‌గ్స్‌తో సంబంధం వున్న వారి పేర్ల‌న్నీ బ‌య‌టికి వ‌స్తున్నాయి.

సారా అలీఖాన్‌, ర‌కుల్‌, శ్ర‌ద్దా క‌పూర్ ల పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయంటూ జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా దీపికా ప‌దుకునే , అమె మేనేజ‌ర్ కూడా డ్ర‌గ్స్ వివాదంలో వున్నార‌ని వార్తా క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. దీంతో ఎన్సీబీ అధికారులు వీరిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే దీపిక మేనేజ‌ర్ క‌రిష్మాకు స‌మ‌న్లు పంపించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే స‌మ‌యంలో దీపిక హాలోవీన్ డ్ర‌గ్స్ పార్టీ కూడా వెలుగులోకి వ‌చ్చింద‌ని మీడియాలో క‌థ‌నాలు రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 2017లో ఈ పార్టీకి సంబంధించిన దీపిక ఆమె మేనేజ‌ర్ క‌ష్మాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింద‌ని అది తాజాగా ఎన్సీబీ అధికారుల‌కు ల‌భించిందిని చెబుతున్నారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా స‌జావుగా జ‌రుగుతున్న‌ట్టు స‌ద‌రు చాట్ వెల్ల‌డించిన‌ట్టు జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

2017 అక్టోబ‌ర్ 28న ముంబైలోని కోకో అనే అల్ట్రా మోడ్ర‌న్ క్ల‌బ్‌లో హాలోవిన్ డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగింద‌ట‌. ఈ పార్టీకి దీపిక‌, సిద్ధార్ధ్ మల్హోత్రా, సొనాక్షి సిన్హా, ఆదిత్యారాయ్‌క‌పూర్‌ హాజ‌ర‌య్యార‌ట‌. ఆ స‌మ‌యంలో త‌న మేనేజ‌ర్ క‌రిష్మాని దీపిక డ్ర‌గ్స్ స‌ర‌ఫారా గురించి అడినిట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ దీపిక చేసిన చాట్ నిజ‌మేనా? అయితే హాలోవీన్ డ్ర‌గ్స్ పార్టీ ఇచ్చింది ఎవ‌రు? ఎవ‌రెవ‌రు పాల్గొన్నారు అనే విష‌యాల‌ని ఎన్సీబీ అధికారులు ఆరాతీస్తున్నాట్టు జాతీయ మీడియా క‌థ‌నం.

Read more RELATED
Recommended to you

Latest news