ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం – శుభలేఖ సుధాకర్ మధ్య బంధం ఏంటో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో గానగంధర్వుడుగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేపధ్య గాయకుడిగా.. టెలివిజన్ వ్యాఖ్యాతగా.. నిర్మాతగా.. నటుడిగా..సంగీత దర్శకుడిగా ఇలా ఎన్నో రకాలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రధానంగా పనిచేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో వేల పాటలకు తన స్వరాన్ని కూడా అందించారు. అంతేకాదు నాటి నుంచి నేటి వరకు ఉన్న సంగీత కళాకారులలో నెంబర్వన్ స్థానాన్ని ఈయన మాత్రమే సొంతం చేసుకోవడం గమనార్హం. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను కూడా గెలుపొందారు. ఇదిలా ఉండగా తాజాగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శుభలేఖ సుధాకర్ గురించి ఒక వార్త బాగా వైరల్ గా మారుతోంది. అదేమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా , విలన్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభలేఖ సుధాకర్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యారు. పలు సీరియల్స్ లో కూడా ఆయన గతంలో నటించడం గమనార్హం. శుభలేఖ సుధాకర్ జంధ్యాల సహకారంతో ఎస్ పి శైలజ ను వివాహం చేసుకున్నారు. ఎస్.పి.శైలజ ఎవరో కాదు స్వయానా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సోదరి.. ఇక అలా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కు సుధాకర్ బావ వరస అవుతారు. ఇక అలా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం – శుభలేఖ సుధాకర్ బావా బామ్మర్దుల గా వీరిద్దరి మధ్య ఎస్.పి.శైలజ కారణంగా బంధుత్వం ఏర్పడింది.

ఎస్ పి శైలజ కూడా ఎన్నో పాటలకు తన మధురమైన స్వరాన్ని అందించి మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బుల్లితెర పై ప్రసారమౌతున్న సరిగమప ఐడియల్ షో కి కూడా ఎస్.పి.శైలజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎస్పీ శైలజ ఒక మానవత్వం ఉన్న మహిళగా, ప్రముఖ సింగర్ గా గుర్తింపు సంపాదించుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version