మన స్టార్ హీరోలు ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో తెలుసా..?

-

సాధారణంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లి విషయంలో కట్నకానుకలు మాత్రం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇకపోతే ప్రస్తుతం హీరోలు కాస్త లేటుగానే వివాహం చేసుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వరుస సినిమాలలో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీ లైఫ్ కి సమయాన్ని కేటాయించలేమో అన్న ఉద్దేశంతోనే పెళ్లి త్వరగా చేసుకోవడం లేదు అంటూ కూడా కొంతమంది హీరోలు చెబుతున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇమేజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .ఇకపోతే ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకున్న మన సౌత్ హీరోలలో ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

మహేష్ బాబు – నమ్రత :

వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ రెండేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనిపించుకున్న ఈ జంట కృష్ణకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆ తర్వాత పెద్దలు మరొకసారి వీరికి పెళ్లి చేశారు. 2005 లెక్కల ప్రకారమే సుమారుగా నమ్రత రూ.75 కోట్ల వరకు కట్నంగా తీసుకొచ్చిందని సమాచారం.

రామ్ చరణ్ – ఉపాసన:

2012లో ఉపాసన – రాంచరణ్ వివాహం చేసుకోగా.. వీరి పెళ్లికి అప్పట్లోనే రూ .15 కోట్ల వరకు ఖర్చు అయింది. ఇకపోతే చరణ్ ఇంటికి ఉపాసన రూ.300 కోట్ల వరకు కట్నం తీసుకొచ్చినట్లు సమాచారం.

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి :
2011 లో వీరి వివాహం జరగగా.. వీరికి ఒక కొడుకు , కూతురు కూడా జన్మించారు ఇప్పుడు అల్లు అర్జున్ కూతురు కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే అప్పట్లోనే రూ .10 కోట్ల వరకు వీరి వివాహానికి ఖర్చుకాగా.. సుమారుగా అల్లు స్నేహారెడ్డి రూ.100 కోట్ల వరకు కట్నంగా తెచ్చిందని సమాచారం.

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి:

2011లో ఈ దంపతులకు వివాహం జరగగా.. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ఇకపోతే అప్పట్లోనే వీరి వివాహానికి సుమారుగా రూ .18 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇకపోతే లక్ష్మీ ప్రణతి కట్నం కింద ఏకంగా రూ.200 కోట్ల వరకు తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version