హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు అయ్యాయి. ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆగస్టు 6న హాజరుకావాలని ముందుగా నోటీసులు ఇచ్చింది ఈడీ.

ఇప్పటికే విచారణకు సమయం కోరారు దగ్గుబాటి రానా. ఇలాటింటి తరుణంలోనే బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు అయ్యాయి. కాగా, బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు జారీ అయ్యాయి.
రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగష్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న హాజరుకావాలని ఆదేశించింది ఈడీ. ఇటీవలే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది ఈడీ.