టాలీవుడ్ లో మరో విషాదం.. ఎడిటర్ గౌతమ్ రాజు మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రముఖ నటులు తుది శ్వాస  విడిచారు. ఈ నేపథ్యంలోనే…తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మరణించారు.

68 సంవత్సరాల గౌతమ్ రాజు నిన్న రాత్రి మరణించినందుకు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడిటర్ గౌతమ్ రాజు అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. తెలుగు, తమిళం అలాగే కన్నడ భాషల్లో సుమారు 800 సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఖైదీ 150, బలుపు, ఊసరవెల్లి, డాన్ శీను, డిటెక్టర్, గబ్బర్ సింగ్, కిక్, బద్రీనాథ్, రేసుగుర్రం, సౌఖ్యం, అదుర్స్ మరియు గోపాల గోపాల లాంటి సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. ఇక గౌతమ్ రాజు మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news