హ్యాపీ డేస్ అప్పు.. సినిమాలు మానేయడానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమానేనా..?

-

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా.. తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ రొమాంటిక్ చిత్రం హ్యాపీ డేస్. బీ టెక్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఇక ఈ సినిమా అంతగా ఆకట్టుకుందీ అంటే బిటెక్ చదివే పిల్లలంతా కూడా మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఆకర్షితులయ్యారు. ఇక ఇందులో నటించిన నటీనటులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వారికి కూడా మంచి క్రేజ్ లభించింది. హ్యాపీడేస్ లో అప్పు పాత్ర మాత్రం ఎవరు మరిచిపోలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి బాయ్ హెయిర్ కట్ తో నిఖిల్ సరసన నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజానికి ఈమె అసలు పేరు గాయత్రీరావు.

గాయత్రి రావు ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి బెంగళూర్ పద్మ కూతురు. ఇక మొదటి సారి తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మొదటి సినిమాతోనే తన క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయి ఆ క్యారెక్టర్ ను ప్రేక్షకులలో ఇప్పటికీ గుర్తుండిపోయేలా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా గాయత్రీరావు తల్లి బెంగళూరు పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పు సినిమా కెరీర్ కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హ్యాపీ డేస్ సినిమాలో అప్పు క్యారెక్టర్ విషయంలో ఆలోచించి సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకుంది అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇందులో బాయ్ హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పడంతో కాస్త ఇబ్బంది పడి.. చేయించుకున్నాక బాగా ఏడ్చింది. ఇక ఆ తర్వాత ఈమె క్యారెక్టర్ చూసి అంతా బాగుందని మెచ్చుకున్నారు.

గాయత్రి నటించిన తరువాత చిత్రం పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా వచ్చిన గబ్బర్ సింగ్. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ అని చెప్పి తీసుకున్నారు. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యాక డిఫరెంట్ టాక్ వచ్చిందని తెలిపారు. ఇక ఈ సినిమా చేసిన తర్వాత తాను సినిమాలు చేయనని చెప్పిందట. సినిమాలు మానేసి పీజీ కూడా పూర్తి చేసిందని.. 2019 లో వివాహం చేసుకొని చెన్నైలో సెటిల్ అయింది అని బెంగళూరు పద్మ గాయత్రి రావు గురించి వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version