రూ.300 కోట్ల‌తో ఇల్లు క‌డుతున్న హీరో ధనుష్ !

-

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో… హీరో ధ‌నుష్‌ కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే. గత నెలలో త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ కూతురు నిర్మాత ఐశ్వ‌ర్య జంట విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్ర‌కటించారు.

ఇది ఇలా ఉండగా.. చెన్నైలో ఒక అరుదైన ఖరీదైన ఇంటిని హీరో ధనుష్ నిర్మించ బోతున్నాడని సమాచారం అందుతోంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ ఇల్లు కడుతున్నారట ధనుష్. ఈ అంకె నిజమే అయితే సౌత్ హీరోలు అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించబోయేది ధనుష్ అనుకోవాలి.

సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సార్ లో ధనుష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకున్నట్లూ టాక్. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నూ ధనుష్ సినిమా ఒప్పుకున్నాడట. ఆ సినిమాకు కూడా 50 కోట్ల పారితోషికాన్ని ధనుష్ అందుకో బోతున్నాడు అని సమాచారం. ఈ నేపథ్యంలోనే.. రూ.300 కోట్లతో ధనుష్‌ ఇల్లు కడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version