హీరోయిన్ కారెక్టర్ డామినేషన్ అందుకే చైతూ గుడ్ బై.!

-

సర్కారు వారి పాట విడుదలై ఏడు నెలలు గడుస్తున్నా.. చై పరుశురాంల సినిమా సెట్ కాలేదు. పరశురామ్ తర్వాత సినిమా అక్కినేని నాగచైతన్య తో చేయవలసి ఉంది. దీంతో అందరూ ఈ సినిమా ఆగిపోయిందనే అనుకుంటున్నారు.అయితే డైరెక్టర్ పరుశురాం నాగ చైతన్య కోసం రాసిన  కథ హీరోకు నచ్చలేదని తెలుస్తోంది.

స్క్రిప్టు విషయం పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోవడంతో.. నాగ చైతన్య సినిమా నుంచి తప్పుకున్నారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథ లైన్ కూడా కొద్దిగా బయటకు వచ్చింది. హీరో ఓక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడట. ఆ కంపెనీలో  ఉన్న లేడీ బాస్ తో లవ్ లో పడతారని.. ఇందులో హీరోయిన్ డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని.. అందుకే చై ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఇటు పరశురామ్  కూడా సేఫ్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.సర్కారు వారి పాట తర్వాత  చైతన్యకు రాసిన కథనే విజయ్ దేవరకొండ ఇమేజ్ కి తగినట్టు మార్చి ఈ సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.తీస్తున్నాడట పరశురాం. తనకు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు పరశురాం మీద నమ్మకంతోనే విజయ్ ఈ సినిమా ఓకే చెప్పారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news