‘చచ్చిపోతా’నంటూ చేసిన పోస్ట్‌ను ప్రచారం చేయకండంటూ.. మాధవీలత మ‌రో పోస్ట్‌..

-

నచ్చావులే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత.. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. ఇక తన సోషల్ మీడియా పేజ్‌లో మాత్రం ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపుతోంది. తాను చచ్చిపోతాననే విషయాన్ని తన స్నేహితులతోనూ చెబుతూ ఉంటానని తెలిపింది. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా తాను చచ్చిపోతానని పోస్ట్ చేసింది. తనను మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నాయని తెలిపిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై స్పందించి వివరణ ఇచ్చింది. ‘డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు.. కానీ, నేను బాగానే ఉన్నాను.. ఉంటాను.. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే… మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను. రిలాక్స్‌ కండి.. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను జస్ట్ క్యాజువల్ గా నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అని ఆమె వివరణ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news