బాలీవుడ్ నిర్మాతపై మద్యం బాటిల్ విసిరిన నటి సంజన

-

ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌ సంజనా గల్రాని, బాలీవుడ్‌ నిర్మాత వందనాజైన్‌ల మధ్య గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బెంగళూరు, రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఇరువురు గొడవపడ్డారు. ఈ సందర్భంలో వందనపై సంజన మద్యం బాటిల్ విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సంజన మాట్లాడుతూ, వందనతో గొడవ జరిగిన మాట నిజమేనని… అయితే, అది చిన్నపాటి గొడవేనని చెప్పింది. గొడవకు సంబంధించి హోటల్ లో రాజీ చేసుకున్నామని తెలిపింది.

అయితే, వందనా జైన్ కు రూ. 200 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని సంజన డిమాండ్ చేసింది. బెంగళూరులో వందనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, కానీ ఇక్కడ రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. ముంబైలో కూడా రూ. 20 కోట్ల విలువ చేసే బంగళా ఉందని చెప్పారు. ఆ బంగళా కూడా అక్రమమేనని చెప్పింది. ఇలాంటి వారు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో విచారణ జరిపితే బయటపడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version