క‌రోనా కాటుకు బ‌లైన సినీ గీత ర‌చ‌యిత ఇబ్ర‌హం

-

సినీ ప‌రిశ్ర‌మలో మ‌రో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క‌రోనా వైర‌స్ మ‌రో సెల‌బ్రెటీని బ‌లి తీసుకుంది. హిందీ సినీ గీత ర‌చ‌యిత ఇబ్ర‌హీం ఆష్క్ (70) క‌రోనా మ‌హ‌మ్మారి సోకడంతో మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని ఇబ్ర‌హీం ఇష్క్ కుమార్తే.. ముసాఫా ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించారు. గ‌త కొద్ది రోజుల క్రితం ఇబ్ర‌హీం ఆష్క్ కు క‌రోనా వైర‌స్ సోకిందని తెలిపింది. అయితే శ‌నివారం రోజు ఇబ్ర‌హీం ఆష్క్ కు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఎదురు అయింద‌ని తెలిపారు.

దీంతో ముంబై లోని మెడిటెక్ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించామని అన్నారు. ఆస్ప‌త్రి లో వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డంతో కరోనా తో పాటు న్యూమోనియా కూడా సోకింద‌ని తేలిన‌ట్టు తెలిపారు. ద‌గ్గు, ర‌క్తం వాంతులు కూడా అయ్యాయ‌ని తెలిపారు. ఆస్ప‌త్రిలో వెంటిలేట‌ర్ తో చికిత్స అందించినా.. ఫలితం ద‌క్క‌లేద‌ని అన్నారు. అలాగే ఇబ్ర‌హీం ఆష్క్ హార్ట్ పేషంట్ కావ‌డంతో ప‌రిస్థితి విష‌మించింద‌ని అన్నారు. కాగ సోమ‌వారం రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇబ్ర‌హీం ఆష్క్ కుమార్తే.. ముసాఫా ఖాన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news