రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ.. నేడు సీఎం జగ‌న్ కీలక స‌మావేశం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ 5 వేలకు చేరువలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కోవిడ్, వైద్య, ఆరోగ్య శాఖల పై సమీక్ష చేపట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. రేపటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

కర్ఫ్యూ పై కూడా మార్గదర్శకాలను సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇక ఈ సమీక్ష సమావేశానికి ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీస్‌ శాఖ అధికారులు పాల్గొనే ఛాన్స్‌ ఉంది. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం లాంటి అంశాలపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో… ఆస్పత్రుల పనితీరుపై ఇవాళ చర్చించనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news