దిల్ రాజును కార్నర్ చేసి మాట్లాడడం సరికాదు – సి కళ్యాణ్

-

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మీటింగ్ ఈరోజు (గురువారం) భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ..నిర్మాతల కష్టాలను పరిష్కరించుకునేందుకు నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశామన్నారు. సమస్యలు పరిష్కారం అయితే నిర్మాతలకు చాలా ఉపశమనం కలుగుతుందన్నారు కళ్యాణ్. మన కళ్లు మనం పొడుచుకోవద్దన్నారు. వారం, పది రోజులు ఓపికపడితే సమస్యలన్ని పరిష్కారం అవుతాయన్నారు.

కమిటీలు వేసుకొని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు. నిర్మాతలెవరూ బయట ప్రచారమయ్యే పుకార్లను నమ్మొద్దన్నారు కళ్యాణ్. నిర్మాతలందరం కలిసికట్టుగా ఉన్నామన్నారు. నిర్మాతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు.నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదైనా అందరి లక్ష్యం ఒకటేనని చెప్పారు. దిల్ రాజు గారు ఆయన సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తున్నారని అన్నారు. దిల్ రాజును ఒక్కడినే కార్నర్ చేసి మాట్లాడటం సరికాదన్నారు.
అందరం పనులు జరగాలని కష్టపడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news