Puneeth Rajkumar : ‘జేమ్స్’ మూవీ రివ్యూ

-

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఇటీవలే.. మరణించిన సంగతి తెలిసిందే. జిమ్‌ చేస్తూ.. గుండెపోటుకు గురైన పునీత్‌ రాజ్‌ కుమార్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. ఇది ఇలా ఉండగా.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌. రు. ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌ గా నటించారు. అలాగే చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పునీత్‌ జయంతి సందర్భంగా అంటే ఇవాలే ఈ సినిమా విడుదల అయింది.

బెనిఫిట్‌ షో అయినప్పటి నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ట్విట్టర్‌ లో సినిమాకు రివ్యూ కూడా ఇస్తున్నారు నెటిజన్లు. దాదాపు కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌ లో ఈ సినిమాను విడుదల చేశారు. పైగా ఈ రోజు పునీత్‌ జయంతి కావడంతో.. జనాలు సినిమా చూడటానికి ఎగబడుతున్నారు.

మరో వైపు చిరంజీవి, మోహన్‌ లాల్‌ లాంటి హీరోలు కూడా జేమ్స్‌ సినిమా విజయం సాధించడమే పునీత్‌ కు మన ఇచ్చే ఘనమైన నివాళి అంటూ ట్వీట్స్‌ ఇప్పటి కే చేశారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన జేమ్స్‌ ఈ సినిమా ఎలా ఉందో అభిమానులు, సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాలను మన ట్విట్టర్‌ రివ్యూలో చూద్దాం..

Read more RELATED
Recommended to you

Latest news