నిర్మాత దిల్‌రాజు కుటుంబానికి జనసేన సానుభూతి

-

నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్​ సుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

pawan kalyan condolence to dil raju father

సోమవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దిల్​ రాజు తండ్రి మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలి వెళ్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాం సుందరరెడ్డి నిన్న మృతి మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దిల్ రాజు కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ‘శ్యాంసుందరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version