నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్న జాన్వీ కపూర్ క్రేజీ బయోపిక్ ..!

-

అందాల తార ..అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడింది. అయితే తన మొదటి సినిమా గురించి ఆ సినిమా ఎంట్రీ గురించి ఒక్క బాలీవుడ్ లోనే కాదు మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తుందో ..స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో … నటనలో తల్లిని ఎంత వరకు మ్యాచ్ చేస్తుందో అన్న రక రకాల అనుమానాలు చాలామందిలో ఉండేవి.

 

కాని అన్నిటికి ఒక్క సినిమాతో సమాధానం చెప్పేసింది ఈ అతిలోక సుందరి కూతురు. 2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ధఢక్ మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్..మొదటి సినిమాతోనే నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులతో పాటు మేకర్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తన రెండవ సినిమాతో పెద్ద ఛాలెంజింగ్ రోల్ చేస్తుంది. కార్గిల్ యుద్ధంలో విమెన్ పైలట్ గా విరోచితమైన పాత్ర పోషించిన గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తుంది ఈ అందాల తార. గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తుంది.

ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. అయితే లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకప్పోవడంతో డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. థియేటర్స్ లో విడుదల కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఈ సినిమాని శరణ్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version