యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన కీర్తి సురేష్

-

ప్ర‌స్తుత స‌మ‌యంలో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కోన‌సాగుతున్న కీర్తి సురేష్.. తాజా గా యూట్యూబ్ ఛాన‌ల్ ను ప్రారంభించారు. ఈ విష‌యాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. త‌న అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్ ను ప్రారంభింస్తున్నాని ట్విట్ట‌ర్ లో తెలిపారు. Keerthy Suresh Official అనే పేరుతో త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ను స్టార్ట్ చేసిన‌ట్టు తెలిపారు. అంతే కాకుండా త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లింక్ ను కూడా కామెంట్ చేసి స‌బ్ స్క్రైబ్ చేసి త‌న వీడియోలు చూడాల‌ని కోరింది. అయితే కీర్తి సురేష్ ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్ప‌టి నుంచి యూట్యూబ్ లో కూడా యాక్టివ్ గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. కాగ త‌న యూట్యూబ్ ఛానల్ నుంచి షార్ట్ వీడియో ల‌తో పాటు ఫిట్ నెస్ వీడియోలను త‌న అభిమానుల‌తో పంచుకోనున్నారు. కాగ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీకి వ‌చ్చిన త‌క్కువ స‌మ‌యంలో చాలా క్రేజ్ సంపాదించుకుంది. వ‌రుస సినిమాల‌తో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మ‌హాన‌టి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. కాగ కీర్తి సురేష్ ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ స‌ఖీ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమా ఈ నెల 28 న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news