PS-1 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన కుష్బూ..!!

-

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్.. ఇకపోతే ఈ సినిమా తమిళనాట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. హాలీవుడ్ తో పాటు రాజకీయపరంగా కూడా రచ్చ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. ఇకపోతే తాజాగా ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ చేసిన కామెంట్స్ సినిమాకు పొలిటికల్ కలర్స్ ను కూడా అద్దేసాయి. ఇకపోతే లేటెస్ట్ గా కుష్బూ క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం గమనార్హం. చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం అంటే మాటలు కాదు.. అది మణిరత్నం వల్లే సాధ్యమవుతుంది అని తేలింది. ఇక రాజరాజ చోళన్ని హిందువుగా చూపించారంటూ డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన కామెంట్స్ కి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు.

చూసే కళ్ళలోనే తేడా ఉంది.. వీళ్ళందరూ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటూ ఆమె సూచించింది. అంతేకాదు తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారిపోయాయి. ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసి.. సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకి వీళ్ళు ఇచ్చే రివ్యూలు అవసరం లేదు. చరిత్రను మార్చడం ఎవరి తరం కాదు.. పైగా మణిరత్నం లాంటి దర్శకులు అటువంటి తప్పు చేయనే చేయరని సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కి కాషాయ రంగు దుస్తుల్లో వచ్చిన కుష్బూ మణిరత్నం ను పొగిడేస్తూ కొంతమంది యువ దర్శకులపై కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది. మరోపక్క సినీ పరిశ్రమకు కాషాయ రంగు పులిమేస్తున్నారు అంటూ దర్శకుడు వెట్రిమారన్ కి కూడా మద్దతు పెరుగుతోంది.


ఇక రాజరాజ చోళుడికి , తిరువళ్లువర్ కి కాషాయ రంగు జెండా కప్పడం ఏంటి అని కూడా నిలదీస్తున్నారు, ఇకపోతే హిందూ మతాన్ని, దేవుళ్ళని వ్యతిరేకించడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందన్న వెర్షన్ కి కూడా కుష్బూ కామెంట్లు బలాన్నిచ్చాయి. ఇకపోతే కుష్బూ చేసిన కొన్ని కామెంట్స్ సినిమాకి కమర్షియల్ గా ప్లస్ గా మారుతున్నాయి . ఇక ఈ సినిమా తమిళనాట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version