సరికొత్త టీవీ షోతో ఓటీటీలోకి మంచు మనోజ్‌ ఎంట్రీ.. ఎక్కడో తెలుసా?

-

మంచు మనోజ్.. చాలా కాలం తర్వాత ఈ హీరో మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే తన కొత్త సినిమా ప్రకటించాడు. ‘వాట్‌ ది ఫిష్‌’ (మనం మనం.. బరంపురం అనేది ఉప శీర్షిక) అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాడు. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్​లో మనోజ్ ఫుల్ జోష్​లో ఉన్నాడు. ఇన్నాళ్లూ తెరకు దూరమైన ఈ హీరో.. ఇప్పుడు ఓవైపు వెండితెర మరోవైపు డిజిటల్ మీడియాపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మనోజ్ హోస్టుగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ వేదికగా ఓ టాక్‌ షో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మంచు మనోజ్‌ రీఎంట్రీపై తన వాయిస్‌ను వినిపించారు.

‘‘నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమాపై పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్‌గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్‌ స్టార్‌ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌ ,అరుపులు కేకలు ఇలా పండగలా జరిగిన నా కెరీర్‌లోకి ఓ సైలెన్స్‌ వచ్చింది. మనోజ్‌ అయిపోయాడన్నారు. కెరీర్‌ ఖతం అన్నారు. యాక్టింగ్‌ ఆపేశాడు. తిరిగి రాడన్నారు. అన్నీ విన్నా.. చూశా.. మౌనంగా భరించా.. తిరిగొస్తున్నాను’’ అంటూ మంచు మనోజ్‌ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news