రేపు జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషా మహల్ టికెట్లను ప్రకటించనున్న BRS !

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పటికే 115 సీట్లను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక పెండింగ్ టికెట్ల ప్రకటన కు BRS అధినేత, సీఎం కేసీఆర్‌ సిద్ధం అవుతున్నారు. పెండింగ్ లో జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గొషా మహల్ టికెట్లను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనగామ పై పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తి రెడ్డీ యాదగిరి రెడ్డి తో మాట్లాటారు మంత్రి కేటీఆర్.

cm kcr is said that hyderabad is mini india

ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి రాజకీయ భవిష్యత్ పై కేటీఆర్ హామీ ఇచ్చినట్టు BRS వర్గాల్లో ప్రచారం సాగుతోంది. జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,తాటికొండ రాజయ్య కు కీలక పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ నిర్నయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లకు సీఎం కేసీఆర్ రాజీ ఫార్ములా అవలంభిస్తున్నారని సమాచారం. జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి TSRTC చైర్మన్ పదవీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆలోచన లో ఉన్నారట. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని తాటికొండ రాజయ్య కు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news