మార్చి నెలలో థియేటర్లలో మెస్మరైజ్ చేయనున్న సినిమాలివే

-

ఫిబ్రవరి నెల ఇవాళ్టితో ముగుస్తోంది. రేపటి నుంచి మార్చి నెల షురూ కానుంది. ఎప్పటిలాగే ఈ వేసవిలోనూ థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు వరుస కట్టాయి. ఈనెల కూడా ప్రేక్షకులను ఫిదా చేసేందుకు కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యాయి. వీటిలో ఎక్కువగా ఆపరేషన్ వాలెంటైన్, భీమా, టిల్లు స్క్వేర్ సినిమాల కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటాయో తెలియాలంటే విడుదల రోజు వరకు   వేచిచూడాల్సిందే.

ఆపరేషన్ వాలెంటైన్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. మార్చి 1న గ్రాండ్ గా థియేటర్ లో విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది.

భూతద్దం భాస్కర్ నారాయణ.. శివకందుకూరి, రాశీసింగ్ ప్రధాన పాత్రలో పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది.

భీమా .. గోపిచంద్ హీరోగా హర్ష దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవే కాకుండా చారి 111 మార్చి1న, మార్చి 15న తంత్ర, 22వ ఓం భీమ్ బుష్, ఆ ఒక్కటీ అడక్కు, 29న టిల్లు స్క్వేర్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news