BRO ప్రీ రిలీజ్ ఈవెంట్​లో మెగా హీరోస్.. ఫొటోలు వైరల్

-

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌-సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. జులై 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ జరిగింద. ఈ ఈవెంట్​కు పవన్, సాయితేజ్ సహా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు హాజరయ్యారు. ఈ సినిమాలో నటించిన హాట్ బ్యూటీస్​ కేతిక శర్మ – ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కూడా వచ్చారు. మెగా హీరోలంతా ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఒరిజినల్ వెర్షన్​ వినోదయ సీతమ్​కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే బ్రో చిత్రానికి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే, మాటలు అందించారు. సినిమాలో పవన్‌ కల్యాణ్ టైమ్​ అనే మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించనుండగా.. సాయితేజ్ మార్క్​ అనే పాత్రలో కనిపించనున్నారు.

అనుకోని ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి దేవుడి కనిపించి బతకడానికి రెండో అవకాశం ఇస్తే.. ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news