ర‌జ‌నీ వ‌ర్సెస్ య‌ష్‌.. గెలిచేది ఎవ‌రో..?

-

సాధార‌ణంగా రజనీకాంత్‌ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్‌ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ఈ ఏడాది ‘దర్బార్‌’తో ప్రేక్షకులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రియు ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాగా ఇది నిర్మితమవుతోంది. అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర‌యూనిట్‌. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక మ‌రోవైపు ‘బాహుబలి’ తరువాత అదే క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’.

కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. కన్నడతో పాటు తమిళ.. తెలుగు .. హిందీ భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ర‌జ‌నీ వ‌ర్సెస్ య‌ష్ మ‌ధ్య గ‌ట్టిపోటీ ఉండ‌నుంది. మ‌రి ఈ పోటీలో ఎవ‌రు స‌క్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news