రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం

-

 తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై సగౌరవంగా నిలబెట్టిన దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్​కు గ్లోబల్ వేదికగా కీర్తిని తీసుకువచ్చారు. ఇప్పటికే ఆయన తన దర్శకత్వంతో ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా జక్కన్న మరో ఘనతను కూడా అందుకున్నారు.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) సింపుల్‌గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీ రాజమౌళికి అరుదైన గౌరవం అందించింది. ఆస్కార్స్ అకాడమీలో మెంబర్​గా ఉండేందుకు రాజమౌళికి ఆహ్వనం దక్కింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 487 మందికి ఈ ఆహ్వానం దక్కగా, వీరిలో జక్కన్నతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు ఈ దంపతులు అర్హత పొందారు. కాగా, ఈ గౌరవం దక్కించుకున్న రాజమౌళి దంపతులకు అభిమానులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version