ఏపీలో టీడీపీ మహిళ కార్యకర్త దారుణ హత్య

-

ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఆళ్లగడ్డ పట్టణంలో శ్రీదేవి అనే కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆస్తి తగాదాల విషయంలో శ్రీదేవిని హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అఖిల ప్రియ విజయానికి శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ పంపిణీ వాహనాలకు ఇక సెలవు. రేషన్ వాహనాలను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి స్వస్తి పలికింది. మళ్ళీ పాత రేషన్ షాపుల విధానాన్ని ప్రారంభించనుంది. ఈమేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version