నా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది – గాయత్రి గుప్తా..!

-

బుల్లితెర వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు గాయత్రి గుప్త. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ డిఫరెంట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ. గతంలో తన ఆరోగ్యం పై కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు మరొకసారి తన పరిస్థితి బాగోలేదంటూ కామెంట్లు చేసింది. ఇకపోతే వెండితెరపై ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి యాంకర్ గా మారి ఆ తర్వాత నటిగా మారింది. ఇక టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా ఒక్క సిల్వర్ స్క్రీన్ పైనే గ్లామర్ ఒలకపోస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ అలరిస్తోంది.

ఇకపోతే గాయత్రి గుప్తా టాలీవుడ్ నుంచి వరుసగా కొబ్బరిమట్ట, ఐస్ క్రీమ్, ఫిదా వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ , బుర్రకథ, ఐస్క్రీమ్ టు, జంధ్యాల రాసిన ప్రేమ కథ , కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాలలో సందడి చేసింది. ఇకపోతే గతంలో ఎన్నోసార్లు తనకు ఆరోగ్యం బాగోలేదని వెల్లడించిన ఈమె ఇప్పుడు మరొకసారి చాలా క్రిటికల్ గా తన ఆరోగ్యం మారింది అంటూ చెబుతోంది.

రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా పలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తూ తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పింది. గత కొంతకాలంగా నేను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇక రేపు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నాను . నెలకు ఒకటి రెండు ఇంజక్షన్లు కూడా తీసుకుంటున్నాను అంటూ వెల్లడించింది. ఇంజక్షన్ చేయకపోతే తాను మంచానికే పరిమితం అవుతానని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. దీంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gayathri Gupta (@gayathrigupta)

Read more RELATED
Recommended to you

Latest news