వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు..!

-

తాజాగా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన.. కచ్చితంగా సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన నాగబాబు మీడియాతో మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల పారితోషకం తీసుకునే పవన్ కు అసలు ప్యాకేజీ తీసుకునే అవసరం ఉందా? అని నాగబాబు ప్రశ్నించారు. తమకు ఈ ప్యాకేజీ ఎవరిచ్చారు? అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. వాడొక పెద్ద ఎదవ, సన్యాసి, అలాంటి నీచ్ కమిన్ కుత్తే గురించి నేను మాట్లాడను..ఒకవేళ మాట్లాడినా అనవసరం అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు నాగబాబు. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారతాడని పేర్కొన్న నాగబాబు.. కాపులకు ఆత్మాభిమానం లేదా? కాపులకు చాలా రెస్పెక్ట్ ఉంది అంటూ కూడా తెలిపారు. కుల పిచ్చి లేదని అన్ని కులాలను గౌరవిస్తామని ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు.

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ పై మెగా బ్రదర్ నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు విన్న రాంగోపాల్ వర్మ నాగబాబుపై ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనేది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇకపోతే నాగబాబు మాట్లాడుతూ.. ప్యాకేజ్ ప్యాకేజ్ అని మొరుగుతున్నారు.. ప్యాకేజీ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా? అని కొడాలి నాని స్టైల్ లో నేను అడగవచ్చు. కానీ అలా అనేందుకు నా సభ్యత అడ్డు వస్తోందని నాగబాబు తెలిపారు. మీ తాత, మీ అయ్య ఏమైనా మాకు ప్యాకేజీలు ఇచ్చారా ? అంటూ కూడా నాగబాబు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version