అంత Ego పనికిరాదు.. స్టార్ హీరోయిన్​పై నారాయణ మూర్తి కామెంట్స్

-

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి అనగా.. ఆ మాటలను ఆయన సతీమణి సుధామూర్తి వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఏడాది ఆరంభంలో నారాయణ మూర్తి దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సయమంలో మూర్తి కరీనా ప్రస్తావన తీసుకువచ్చారు. ‘‘ఓసారి నేను లండన్‌ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్‌ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి నటిని పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’’ అని నారాయణ మూర్తి ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు. పక్కనే ఉన్న సుధామూర్తి ఆయన మాటలను అడ్డుకుంటూ.. ఆమెకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారని.. అందుకే విసిగిపోయి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by ENTREPRENEURS OF INDIA (@eoindia)

Read more RELATED
Recommended to you

Latest news