డ్ర‌గ్స్‌కేస్‌: ముగ్గురు హీరోల‌కు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు?

-

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతితో రియా కార‌ణంగా బ‌య‌ట‌ప‌డిన‌ డ్ర‌గ్ కేసు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసులో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సిమోన్ ఖంబట్టా పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేర్లు కూడా వెలువడుతున్నాయి. టాలెంట్ మేనేజర్ జయ సాహాను విచారించడం మరియు ఆమె వాట్సాప్ చాట్‌ల‌లో కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో డ్ర‌గ్స్ కేసు బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

ఈ కేసులో విచార‌ణ‌కు  హాజ‌రైన ఏ ఒక్క‌రికీ ఎన్సీబీ క్లిన్ చిట్ ఇవ్వ‌లేదు. ఇదిలావుండగా బాలీవుడ్‌లోని ముగ్గురు బిగ్ స్టార్ హీరోల‌ని ఎన్సీబీ పిలవబోతోందని జాతీయ మీడియా పేర్కొంది. ‘ఎస్’, ‘ఆర్’ అండ్  ‘ఎ’ అనే అక్షరాలతో పాటు దీపికా పదుకొనేతో కలిసి పనిచేసిన ముగ్గురు పెద్ద హీరోల‌కు ఎన్సీబీ సమన్లు ఇవ్వ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఈ కేసులో అరెస్ట్ అయిన  నిర్మాత క్షిజిత్‌ ప్రసాద్ ఈ మూడు పేర్లను దర్యాప్తులో ఎన్‌సిబికి వెల్లడించార‌ట‌.

‘ఎ’ అనే అక్ష‌రంతో పేరు మొద‌ల‌య్యే నటుడు ‘మాదకద్రవ్యాలు’ మాత్రమే కాకుండా ఇతరులకు ‘సరఫరా’ కూడా చేశాడని వార్త‌లు వ‌స్తున్నాయి. ‘ఎ’ అనే నటుడికి క్రికెటర్‌తో సంబంధం కూడా ఉంద‌ట‌. ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్ హీరోల గురించి బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news