Bigg Boss Telugu 8 : నామినేషన్‏లోకి రా అంటూ.. యాష్మీపై నెటిజన్స్ ఫైర్…!

-

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. గత సీజన్లో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోబాశెట్టి లాంటి ప్రవర్తనతో యాష్మీ అందరికీ చిరాకు తెప్పిస్తోంది. ఈ సీజన్ మొదటి నుంచి యష్మీ గౌడ ప్రవర్తన, ఆమె ఆట జనాలకి నచ్చట్లేదు. నెట్టింట ట్రోల్స్ చూస్తే తెలుస్తోంది. ఆమె ఓవరాక్షన్, కొంచెం కోపం ఇతర కంటెస్టెంట్లపై మాటలతో విరుచుకు పడడం ఎవరికీ ఞ్చచట్లేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మి ప్రవర్తన చూసి అందరూ షాక్ అవుతున్నారు గత సీజన్లో కార్తీక దీపం సీరియల్ ఫ్రేమ్ శోభ శెట్టిని ఆడియన్స్ ఎలా తిట్టారో ఇప్పుడు కూడా ఆమెని అలాగే ఆడుకుంటున్నారు.

యష్మి గౌడ గేమ్స్ ఆడి చీఫ్ కాలేదు. హౌస్ లో ఆమె ప్రవర్తన మాత్రం ప్రేక్షకులకి చిరాకు తీసుకొస్తోంది. తన స్నేహితులు గెలిచినా సరే తట్టుకోలేకపోతోంది ఎప్పుడు తనే గెలవాలని చూస్తోంది. అందుకే ఫౌల్ గేమ్స్ ఆడిన ఓకే అన్నట్లు ప్రవర్తిస్తోంది. పక్క టీం రేషన్ కొట్టేసి ప్రూఫ్ ఉందా అంటూ రెచ్చిపోవడం ఎదుట టీం వాళ్ళు ఓడిపోతే డాన్స్ చేస్తూ అరుస్తూ సైకోల ప్రవర్తించడం.. ఇష్టం వచ్చినట్లు పక్క టీం వాళ్లపై నోరు పారేసుకోవడం కావాలని రెచ్చగొట్టడం ఇలాంటివి చేస్తూ అందరినీ ఇరిటేట్ చేస్తోంది.

దీంతో నెటిజెన్స్ ఆమెపై దారుణంగా ఫైర్ అవుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆమె ప్రవర్తన చూసి అందరూ అవాక్కవుతున్నారు. నబీల్, విష్ణు ప్రియా గేమ్ నుంచి అవుట్ కాగానే పిచ్చిగా డాన్స్ చేసింది. సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యశ్మీ ప్రవర్తన పై అందరూ చిరాకు పడుతున్నారు. ఏమీ లేని చోట కూడా డాన్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ తానే నెగ్గాలి అవతల వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అన్నట్లు ఉండడం ఎవరికీ నచ్చట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news