ప్రొడక్షన్ తో పాటు మరో కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నిహారిక..!

-

Niharika: మెగా డాటర్ నిహారిక గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోయినా ఇప్పటికీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. వ్యక్తిగత విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్మాతగా మారిన నిహారిక మరో కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

మెగా డాటర్ నిహారిక తాజాగా నిర్మాతగా మారి చిత్రాలను నిర్మిస్తోంది. వ్యక్తిగత విషయాలపై ఎన్నో వార్తలు వినిపిస్తున్నప్పటికీ వీటిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని ఈమె యాక్టింగ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి సిల్వర్​స్క్రీన్​పైకి కాకుండా డిజిటల్ ప్లాట్​ఫామ్​ ఓటిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఓటిటీ నిహారిక కు కొత్తేమీ కాదు. ఇప్పటికే ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్​ల్లో నటించింది. తాజాగా ‘డెడ్ పిక్సల్స్​’తో ఆడియెన్స్ ముందుకు రానుంది.

Niharika

ఈ డెడ్ పిక్సల్స్ సిరీస్ లో వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్నారు. బీబీసీ స్టూడియోస్ ఇండియా అండ్ తమడ మీడియా సంయుక్తంగా ఈ సిరీస్​ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముఖ్యంగా ఇందులో యువత వీడియో గేమ్స్ కు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో చూపించినట్టు తెలుస్తోంది.

ఆనంద్, గాయత్రీ, భార్గవ్, రోషన్ అనే నలుగురు స్నేహితులు కలిసి ఓ ఆన్​లైన్​లో గేమ్​లో పాల్గొని అడుతుంటారు. అయితే ఈ గేమ్ కు అలవాటు పడిన వారు అందులోంచి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సైతం వదిలేసి గడపటంతో ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ అని అర్థమవుతుంది. అలాగే అసలు గేమ్ ఏంటి.. ఎందుకు వాళ్ళు ఆ గేమ్ కి అంతలా అడక్ట్ అయిపోయారు.. ఆ తర్వాత ఎలాంటి పర్యవసనాలు ఎదురయ్యాయి.. అనే విషయాలను ఈ సిరీస్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version