నేతాజీ డెత్ మిస్టరీని ఛేదించే కాన్సెప్ట్​తో నిఖిల్ ‘స్పై’

-

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కరిని వెంటాడే ప్రశ్న.. ఆయన డెత్ మిస్టరీ. అసలు ఆయన ఎలా మరణించారు. ఇది ఎప్పటికీ వీడని మిస్టరీ. అయితే నేతాజీ లైఫ్​నకు సంబంధించి ఎప్పుడూ వినని అంశాలతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ‘స్పై’. ఆర్యన్‌ రాజేశ్‌, ఐశ్వర్య మేనన్‌, సన్యా ఠాకూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్వయంగా  నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం న్యూ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో సోమవారం జరిగింది. భగవాన్‌ జీ ఫైల్‌ మిస్‌ అయ్యింది… అంటూ మొలదయ్యే టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సృష్టికర్త అయిన సుభాష్‌ చంద్రబోస్‌ మరణం, రహస్యాల ఛేదన నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు నిఖిల్‌ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ ఏడాది జూన్‌ 29న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version