Tollywood: ప్రముఖ దర్శకుడు గుండె పోటుతో కన్నుమూత

-

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఈరోజు కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో రవికుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం, వీరభద్ర, స్నేహం కోసం, ఆటాడిస్తా, నరసింహ, దశావతారం, జై సింహా, లింగా, రూలర్ (2019) లాంటి అనేక సినిమాలకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలనూ తన ఖాతాలో వేసుకున్నారు.

Noted director AS Ravikumar Chowdhury passed away today
Noted director AS Ravikumar Chowdhury passed away today

ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, రవికుమార్ మరణానికి గల కారణాలు ఇంతవరకు వెలువడలేదు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు రవికుమార్ మరణించడంతో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయని బాధపడుతున్నారు. రవికుమార్ మరణం పై సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రవికుమార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news