ఫిబ్రవరి 7 ఎన్.టి.ఆర్.. 8 వై.ఎస్.ఆర్..!

-

టైటిల్ చూడగానే మ్యాటర్ అర్ధమయ్యి కానట్టు ఉండొచ్చు. బయోపిక్ సినిమాల హవా కొనసాగుతున్న మన టాలీవుద్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పాటుగా వై.ఎస్.ఆర్ బయోపిక్ కూడా వస్తుంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది. ఇక మహి వి రాఘవ్ డైరక్షన్ లో వై.ఎస్.ఆర్ బయోపిక్ గా యాత్ర వస్తుంది.

మమ్ముట్టి వై.ఎస్ పాత్రలో నటించడం యాత్ర సినిమాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఇద్దరు రాజకీయ నాయకులే ఇద్దరు ప్రజల మనసు గెలిచిన వారే.. అయితే ఈ రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో రిలీజ్ కాబోతున్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక వై.ఎస్ యాత్ర మాత్రం ముందు ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 21న అనుకోగా అది కాస్త ఫిబ్రవరి 8కి వాయిదా పడింది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జనవరి 24 అనుకున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు కూడా ఫిబ్రవరి 7కి వాయిదా వేశారట. అంటే ముందు రోజు ఎన్.టి.ఆర్ మరుసటి రోజు వైఎస్సార్ ఇద్దరు రాబోతున్నారన్నమాట. మరి ఈ ఇద్దరిలో ఎవరు ప్రేక్షకుల మనసు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version