వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. ఫొటోలు వైరల్

-

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్​పుర్​లోని లీలా ప్యాలెస్​ వీరి పెళ్లి బంధానికి వేదికగా నిలిచింది. పంజాబీ సంప్రదాయంలో వీరి కల్యాణం ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల సమక్షంలో రాఘవ్.. పరిణీతి మెడలో మూడు ముళ్లు వేశారు.

ఈ వేడుకకు ఇరువురి తరఫున బంధువులు, స్నేహితులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సహా పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కొత్త జంట తమ పెళ్లి ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫెయిరీ టైల్ లవ్ స్టోరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పరి చాలా అందంగా కనిపిస్తోందంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version