BREAKING : అమితాబ్ బచ్చన్ ను కలిసిన పవన్ కల్యాణ్

-

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ అగ్ర నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబ్ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. మర్యాదపూర్వకంగానే ఆయనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినట్లు సమాచారం అందుతోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అంతా బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్టుకి సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ కోసం అమితాబచ్చన్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇలాంటి తరుణంలోనే…. పవన్ కళ్యాణ్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను కలిశారు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం.. మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమా… మరో పది రోజుల్లోనే విడుదల కానుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version