పవన్.. ఎన్టీఆర్.. ఏంటీ కుర్చీలాట..!

-

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా టీజర్ పోస్టర్ ఈమధ్య రిలీజ్ అయ్యింది. రేపు 9 గంటలకు రిలీజ్ అవబోతున్న వీర రాఘవ టీజర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ పోస్టర్ లో కుర్చీలో ఎన్.టి.ఆర్ కూర్చుని ఉన్నాడు. అయితే సేమ్ టూ సేమ్ అజ్ఞాతవాసిలో కూడా కుర్చి తో పవన్ కనిపించాడు.

కుర్చి పక్కన నిలబడి కుర్చి తయారీపై మిని యుద్ధం అనే డైలాగ్ కూడా చెబుతాడు. త్రివిక్రం పవన్, ఎన్.టి.ఆర్ లతో ఈ కుర్చీలాట ఎందుకు ఆడుతున్నాడో కాని అజ్ఞాతవాసి సెంటిమెంట్ తో నందమూరి ఫ్యాన్స్ అరవింద సమేత రిజల్ట్ మీద కూదా కంగారు పడుతున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పవన్, ఎన్.టి.ఆర్ సేమ్ కుర్చి.. సేమ్ పోస్టర్ ఒకరు నిలబడి.. ఒకరు కూర్చుని ఇది పక్కా త్రివిక్రం మార్క్ సినిమాగా అనిపిస్తుంది. పోస్టర్ తో సంచలనం సృష్టిస్తున్న అరవింద సమేత టీజర్ రేపు ఉదయం నుండే అంతర్జాలాన్ని ఆడుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version