వంట చేస్తూ మాట్లాడకూడదా..? అసలు కారణం ఇదే..!

-

సహజంగా ఇంట్లో పెద్దవాళ్లు ఆహారాన్ని తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు మరియు ఆహారం తినే సమయంలో ఎంతో శ్రద్ధ పెట్టాలని చెప్తారు. అయితే కేవలం తినే సమయంలో మాత్రమే కాకుండా ఆహారాన్ని వండుతున్న సమయంలో కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉండాలి. ఈ విధంగా మౌనంగా వంట చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. చాలా శాతం మంది వంట చేసే సమయంలో మరియు ఆహారం తినే సమయంలో ఫోన్ చూడడం లేక ఫోన్ మాట్లాడటం, టీవీ చూస్తూ పనులు చేయడం వంటివి చేస్తారు. అయితే ఈ విధంగా అస్సలు చేయకూడదని ఆహార నిపుణులు కూడా చెబుతున్నారు.

వంట చేయడం కేవలం ఒక పని మాత్రమే కాదు. పూర్తి ఆరోగ్యానికి సరైన విధంగా వంట చేసుకోవడం కూడా ఎంతో అవసరం. అయితే చాలా శాతం మంది వంట చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, మరికొందరైతే టీవీలో సీరియల్స్ వంటివి చూస్తూ వంట చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే శాంతంగా వంట చేస్తారో అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. మాట్లాడుకుండా వంట చేయడం వలన ఎంతో ప్రశాంతకరమైన వాతావరణాన్ని పొందవచ్చు. దీంతో ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది.

చాలా శాతం మంది ఏవైనా పనులు ఒంటరిగా చేస్తున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటారు. అలా కాకుండా మౌనంగా వంట చేస్తూ దానిని ఎంజాయ్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతేకాకుండా మాట్లాడకుండా వంట చేయడం వలన వంట చేసేటప్పుడు వచ్చే శబ్దాలను కూడా గమనించవచ్చు. ఆహారం రంగు, రూపం పై కూడా ఎంతో దృష్టి ఉంటుంది. ఈ విధంగా ఎంతో రుచికరమైన ఆహారాన్ని కూడా తయారు చేయగలరు. కనుక ఇటువంటి ప్రయోజనాలను పొందాలి అంటే తప్పకుండ మౌనంగా మరియు ప్రశాంతంగా వంట చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version