BREAKING : హీరో వెంకటేష్‌పై క్రిమినల్ కేసు

-

టాలీవుడ్ హీరో వెంకటేష్‌ కు బిగ్ షాక్ తగిలింది. హీరో వెంకటేష్‌ పై తాజాగా క్రిమినల్ కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కూల్చివేత‌కు సంబంధించి బాధితుడు కె.నందకుమార్ వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.

police case on tollywood hero venkatesh

ఈ తరుణంలోనే దగ్గుబాటి వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, దగ్గుపాటి అభిరామ్ ల పై కేసు నమోదుకు ఆదేశించింది నాంపల్లి కోర్టు. కాగా, హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.

వెంకటేష్‌ నటించిన 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Latest news