ఎన్టీఆర్ విక్టరీ.. అమ్మడు ఫుల్ హ్యాపీ

-

ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ పూజా హెగ్దె ఆ తర్వాత ఒక లైలా కోసం చేసినా కెరియర్ మీద అంత ప్రభావితం చూపించలేదు. దువ్వాడ జగన్నాథం సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది. డిజే హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన సాక్ష్యం ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడిని మళ్లీ ఇరకాటంలో పడేశాయి.

ఎన్.టి.ఆర్ తో చేసిన అరవింద సమేత మీద అన్ని ఆశలు పెట్టుకోగా గురువారం వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఎన్.టి.ఆర్ విక్టరీతో అందరికన్నా పూజా చాలా ఆనందంగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం పూజా సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో నటిస్తుంది. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ సినిమా కూడా హిట్ అయితే పూజా హెగ్దెకి టాలీవుడ్ లో తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news