క్రేజీ ఆఫ‌ర్‌ని బుట్ట‌బొమ్మ తిర‌స్క‌రించిందా?

-

ఈ ఏడాది `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుంది పూజా హెగ్డే. ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల‌కు వ‌న్ అండ్ ఓన్లీ ఆప్ష‌న్‌గా మారింది. హీరోయిన్ గా టాలీవుడ్‌లో భారీ డిమాండ్ వున్న ఈ బుట్ట‌బొమ్మ తాజాగా ఓ క్రేజీ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌ష్క‌రించింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ టాపిక్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

భారీ సెట్టింగుల‌తో సంచ‌ల‌న చిత్రాల్ని వెండితెర‌పై ఆవిష్క‌రించి అద్భుత‌మైన విజ‌యాన్ని ద‌క్కించుకునే ద‌ర్శ‌కుడిగా గుణ‌శేఖ‌ర్‌కు మంచి పేరుంది. ఆయ‌న చేసిన మ‌నోహ‌రం, `ఒక్క‌డు, రుద్ర‌మ‌దేవి చిత్రాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభిని తెలియ‌జేశాయి. అలాంటి ద‌ర్శ‌కుడు ఐదేళ్ల విరామం త‌రువాత `శాకుంత‌ల` పేరుతో ఓ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. మ‌హాభార‌త ప‌ర్వంలోని శ‌కుంత‌ల‌, దుశ్యంతుడి ప్రేమకావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారు. త‌నే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ గుణ‌శేఖ‌ర్ నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాలో శ‌కుంత‌ల పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పాత్ర కోసం కొంత మంది స్టార్ హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన గుణ‌శేఖ‌ర్ తాజాగా పూజా హెగ్డేని క‌లిసి క‌థ వినిపించార‌ట‌. స్టోరీ ఆస‌క్తిక‌రంగానే వున్నా తల్లిగా క‌నిపించ‌డం, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ పిల్మ్ కావ‌డంతో గుణ‌శేఖ‌ర్ ఇచ్చిన క్రేజీ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిందట‌. దీంతో గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల పాత్ర కోసం మ‌రో హీరోయిన్‌ని ఒప్పించే ప‌నిలో వున్నాడ‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news