వయనాడ్‌ బాధితులకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించిన ప్రభాస్‌

-

వయనాడ్లో కొండచరియలు విరిగినపడిన ఘటనలో ఇప్పటికే 300పైగా మంది మరణించిన విషయం తెలిసిందే. వందల మంది ఆచూకీ గల్లంతయింది. ఇక ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ వారు మాత్రం ఓవైపు తమ ఆత్మీయులను కోల్పోయి.. మరోవైపు నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక మిగిలిపోయారు. అయితే ఈ బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. తాజాగా ఈ జాబితాలో చేరాడు రెబల్ స్టార్ ప్రభాస్.

కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ప్రభాస్ స్పందించాడు. వాళ్లకు అండగా నిలవడం కోసం కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించాడు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తాజాగా ప్రభాస్ టీమ్ వెల్లడించింది. దీంతో ప్రభాస్పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మా రాజ్ సాబ్ మంచి మనసున్న మహారాజు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news