త్రిషపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్… ఆ మాత్రం తెలియదా అంటూ!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది. ఆమె వయసుతో సంబంధం లేకుండా నేటి తరం కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా కొంతమంది హీరోయిన్లు 30 ఏళ్ళ వయసులోకి రాగానే ఇప్పుడు వారి వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నారు.

trisha deepss.rao duplicate copy

 

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రిష ఒక పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఆ పోస్ట్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అయింది. ఈశ్వర్ సినిమాకు వచ్చి శనివారం నాటికి ఇరవై ఏళ్లు పూర్తి అవ్వడంతో.. వర్షం సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేశారు. 4K ఫార్మాట్‌లో రిలీజ్ చేసిన వర్షం సినిమాను చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. థియేటర్లో అభిమానుల అల్లరి, గోల బాగానే వైరల్ అయింది. ఈ వీడియోలు చివరకు త్రిష వరకు చేరినట్టున్నాయి.

త్రిష
త్రిష

దీనిపై త్రిష స్పందించింది. ఇది తెలుగులో నా మొదటి చిత్రం.. పద్దెనిమిదేళ్ల తరువాత మళ్లీ ఇలా రీ రిలీజ్ చేశారు.. కానీ ఈ చిత్రం నిన్నమొన్న వచ్చినట్టుగా అనిపిస్తోంది.. సినిమాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయ్.. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదని నిరూపించాయ్.. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది మీ ప్రేమ వల్లే.. నా మనసు సంతోషంతో నిండింది అంటూ ఇలా పోస్ట్ వేసింది.

ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆమె తన ఫ్యాన్స్ ఉన్నట్లుగా స్పందించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా ఈ హడావిడి కి కారణం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆమె ప్రభాస్ గురించి గానీ అతని ఫాన్స్ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఓ వర్గం ఫాన్స్ అయితే అప్సెట్ అయ్యారు. అసలు ప్రభాస్ గుర్తున్నాడా అనే విధంగా కామెంట్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

Shared post on Time

 

Read more RELATED
Recommended to you

Latest news