పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని మాజీ సీఎం KCR అన్నారు. తాజాగా మాట్లాడిన కేసీఆర్.. ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన బుద్ది చెబుతారు అన్న ఆయన.. స్టేషన్ ఘనపూర్ లోను ఉప ఎన్నిక వస్తుంది. అకఫే కడియం శ్రీహరి ఓడిపోవడం ఖాయం.. అలాగే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా కెలవడం ఖాయం అని ఆయన అన్నారు.
అయితే తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిశారు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. BRS అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది నాయకులు. అయితే ఈ నెల 15న తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో చేరికల కార్యక్రమం జరగనుంది.